శామీర్పేట/కీసర, జనవరి 3: ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జిల్లా అడిషనల్ ` అన్నారు. కీసర మండలం చీర్యాల్ ప్రభు త్వ పాఠశాలను,శామీర్పేట మండలంలోని తిమ్మాయిపల్లి, ఉప్పర్పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలను మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మితో కలిసి సందర్శించారు. అనం తరం చీర్యాల్ ప్రభుత్వ పాఠశాల్లో విద్యాప్రమాణాలు, మధ్యాహ్న భోజనం,హాజరుశాతం,ఉపాధ్యాయు ల పనితీరు గురించి ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను నాణ్యమైన విద్య ను అందించి విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా, సకాలంలో పాఠశాలలకు విచ్చేసి విద్యార్థులకు పాఠాలను బోధించాలని సూచించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సమాయత్తం చేయాలని అన్నా రు. ప్రతి పాఠశాలను జిల్లా విద్యాధికారి తనిఖీలు నిర్వహించి విద్యారంగంలో జరుగుతున్న మార్పులకనుగుణం గా తగిన సూచనలు అందించాలి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతల మీదనే ఉందన్నారు. విద్యార్థులకు కనీస అవసరాలైన తాగునీటి, బాత్రూంల విషయంలో ఇబ్బందులు రాకుం డా చూడాలని ఆదేశించారు. మన ఊరు-మన బడికి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని వాటికి సంబంధించిన పనులను వంద శాతం వెంటనే పూర్తి చేయాలన్నారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవన్నారు. అనంతరం పాఠశాలలకు కేటాయించిన బడ్జెట్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీర్యా ల్ సర్పంచ్ధర్మేందర్, ఏఎంవో రవీందర్, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, ఉప సర్పం చ్ తిరుమలరెడ్డి, కీసర ఏఈ జగపతిబాబు పాల్గొన్నారు.