పటేల్నగర్ అంగన్వాడీ స్కూల్-2ను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ సభ్యులు
సుల్తాన్బజార్,మార్చి 17: అంగన్వాడీల్లో చిన్నారులు,బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్రెడ్డి అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గురువారం నాంపల్లి పటేల్నగర్లోని అంగన్వాడీ స్కూల్-2లో ఆకస్మికంగా ఆయన తనిఖీలను చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీలో బాలింతలతో నేరుగా మాట్లాడి వారికి గుడ్లు,పాలు,బాలామృతం,ఐరన్ మాత్రలు సకాలంలో అందుతున్నాయా అనిఅడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే పేదలకు నాణ్యమైన విద్య,వైద్యం అందుతున్నదన్నారు. మహిళలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడీ టీచర్లు,సూపర్వైజర్లు,సీపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో ఒక్కరోజు సం బంధిత అధికారుల తనిఖీ చేయాలని ఆయన సూచించారు. అంగన్ వాడీ స్కూల్ -2 టీచర్ పుష్పలత పనితీరు పట్ల కమిషన్ సభ్యులు గోవర్ధన్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.