మారేడ్పల్లి : ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శుక్రవారం వెస్ట్మారేడ్పల్లి లోని తన నివాసంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ (Shadi Mubarak) , కల్యాణలక్ష్మి (Kalyanalaxmi ) చెక్కులను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ( CM KCR) దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం లాంటి పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
పేదింటి ఆడపడుచు వివాహానికి రూ. లక్ష 116 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, సీననియర్ నాయకులు టిఎన్. శ్రీనివాస్, తిరుమలగిరి తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.