బాలానగర్ : ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీహాల్ను స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ (Majority) సాధించి పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే కాలనీలో రోడ్లు, డ్రైనేజీలతో పాటు పెండింగ్లో ఉన్న ఇతర పనులు చేపడుతానని, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీఉండబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్చారీ, ఆనంద్, ప్రసాద్, రాజగోపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, సుబ్రహ్మణ్యం, గణేష్, బీఆర్ఎస్ నాయకులు బల్వంత్రెడ్డి, కర్రె జంగయ్య తదితరులు పాల్గొన్నారు.