మేడ్చల్ రూరల్/శామీర్పేట/కీసర: మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్రామ్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల బుధవారం జగ్జీవన్రామ్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన జగ్జీవన్రామ్కు నివాళులర్పించారు. కౌన్సిలర్ గణేశ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, ఏఈ సాయిరాం, మేనేజర్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, జానీ పాల్గొన్నారు. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి ఆధ్వర్యం లో జగ్జీన్రామ్ వర్ధంతిని నిర్వహించారు.
వైఎస్ ఎంపీపీ గోపని వెంకటేశం, ఎంపీడీవో రమాదేవి, డీఎల్పీవో స్మిత, ఎంపీవో వినూత్న, సర్పంచ్లు గణేశ్, బాబుయాదవ్, కవిత, చిన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలో శామీర్పేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉపసర్పంచ్ రమేశ్యాదవ్, శ్రీకాంత్గౌడ్, రవీందర్, అఫ్జల్ఖాన్, జగ్జీవన్రామ్ యువజన సంఘం నాయకులు ఉప్పలయ్య, డప్పు బాబు, రమేశ్, వెంకటేశ్, కిషన్, చిన్నబాబు, తూంకుంటలో మాజీ ఎంపీటీసీ జైపాల్రెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో పద్మావతి, బాల్రాజ్, రాజమణి, తదితరులు పాల్గొన్నారు. కీసర ఎంపీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇం దిరలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, ఎంపీటీసీలు నారాయణశర్మ, వెంకట్రెడ్డి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చీర్యాల్ మల్లన్నగుడి దగ్గర ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. రాంపల్లిదాయర సర్పం చ్ ఆండాలుమల్లేశ్, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సంఘం నేతలు మల్లేశ్, శ్రీరాములు, శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్, జంగయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.