హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ(Traffic DCP) సుబ్బారాయుడు తెలిపారు. రాష్ట్రపతి ఉదయం 9.30 నుంచి 10.15 నిమిషాల వరకు హకీంపేట్ ఎయిర్పోర్టు(Hakeem Airport) కు వెళ్లనుండడంతో లోత్కుంట టి జంక్షన్, బైసన్ గేట్, హెలీప్యాడ్ వై జంక్షన్, యాప్రాల్ రోడ్డు, నవ్య జంక్షన్, బొల్లారం చెక్పోస్టు, హకీంపేట్ ఎయిర్పోర్స్ స్టేషన్ వై జంక్షన్ రూట్లను మూసి వేస్తున్నామని వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.40 మధ్యలో తిరుగు ప్రయాణంలోను వీటిని మూసివేస్తామని పేర్కొన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్కు రాష్ట్రపతి వెళ్తుండడంతో ఆ సమయంలో లోతుకంట టి జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్ టి జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్ గేట్, ఎన్సీసీ ఎక్స్ రోడ్స్, తివోలి ఎక్స్ రోడ్స్, ఫ్లాజా ఎక్స్ రోడ్స్, ఫ్లాజా, సీటీఓ కూడలీని మూసివేస్తున్నామని చెప్పారు. రాత్రి 7. 45 నిమిషాల నుంచి 8. 45 నిమిషాల మధ్యలో తిరుగు ప్రయాణంలో ఈ రూట్లోని జంక్షన్లను మూసేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.