స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.