హైదరాబాద్ : హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాం.హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
బుధవారం రాయదుర్గంలోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను మంత్రి సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశాం. దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్ పొదు. అన్నారు.
రింగ్ రోడ్ చుట్టూ 400 కెవి సబ్ స్టేషన్ లు ,220 కెవి,133 కెవి, 33 కెవి సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశాం. నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయుడం దీని ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. ఈ నాలుగు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం కానీ 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశాం అదే దీని ప్రత్యేకతగా అని తెలిపారు.
దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా మనమే వాడుతున్నాం. పనులు చాలా వేగంగా జరిగాయి. ఈ సబ్ స్టేషన్ తో నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు.
ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను 1400 కోట్ల నిర్మాణం చేశాం .త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారన్నారు. మంత్రి వెంట ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.