మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని కష్టనష్టాల్లో తోడుగా నిలిచేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న పేదల పాలిట ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయ పథకం భరోసాగా నిలుస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం నెహ్రూ నగర్ కాలనీకి చెందిన సురేష్ అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 2 లక్షల ఆర్థిక సాయానికి చెందిన మంజూరు పత్రాలను విప్ గాంధీ మంగళవారం తన నివాసంలో బాధితుడికి అందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి శ్రీనివాస్, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, అనీల్, మధు తదితరులు పాల్గొన్నారు.