కాప్రా, నవంబర్ 30 : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల పరిధిలో ఉదయం 7 గంటలకు ముందు నుంచే ప్రజలు ఓటు వేయడానికి తరలిరావడం కనిపించింది. చాలా కేంద్రాల్లో ఉదయం 9 గంటలలోపే పోలింగ్ కేం ద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు 5శాతంకు పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఉదయం 11.00 గంటలవరకు 15.1శాతం ఓటింగ్ జరిగింది. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి .. కాప్రా ఆదిత్యనగర్లోని విజయా హైస్కూల్లో బీఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, వంశరాజ్ మల్లేష్లతో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, ఆయన సతీమణి జూడీతో కలిసి కందిగూడ కమ్యూనిటీహాల్లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 3లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయిబాబానగర్లోని ఇండో అమెరికన్ స్కూలు కేంద్రం( పీఎస్ నంబర్లు-33,34,35,36 )లో పోలింగ్ మందకొడిగా సాగడంతో ఓటర్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశా రు. వందలాది మంది గంటల తరబడి వేచి ఉండి.. . కొంతమంది వెనుతిరిగి వెళ్లారు. దీనిపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రధాన పార్టీల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
రాచకొండ కమిషనర్ జీఎస్ చౌహాన్ కాప్రా పరిధిలోని శ్రీరామ్నగర్లోని కాల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పా టు చేసిన 21,22,23 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ పరిశీలించారు. వీటితో పాటు పలు ఇతర పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. అయితే పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు తీసుకొని వెళ్లకూడదని పోలీసులు వారించడంతో పలువురు ఓటర్లు అసంతృప్తికి గురయ్యారు. వాటిని అక్కడ ఉంచేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉండాల్సిందని ఓటర్లు అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న సహాయక సిబ్బంది ఓటేయడానికి వచ్చిన పలువురు వృద్ధులను, విక లాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లడంతో వారు సం తృప్తి చెందారు. పలువురి ఓట్లు వేరే పోలింగ్ కేంద్రానికి కేటాయించడం, కొంతమంది ఓట్లు గల్లంతు కావడంతో తీవ్రంగా అసంతృప్తిచెందారు.
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, కాప్రా పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కాప్రాసర్కిల్ పరిధిలోని చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్లలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవియాదవ్, సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్రెడ్డి డివిజన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని పరిశీలించారు. వారితోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, పావనీరెడ్డి, నాయకులు సోమశేఖర్రెడ్డి, మహేష్గౌడ్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు.
మల్లాపూర్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తన తల్లి సుశీలమ్మతో కలిసి తిరుమలానగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు జి.శ్రీనివాస్రెడ్డి, వంజరిప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామంతాపూర్, నవంబర్ 30 : ఉప్పల్ , నాచారం, హబ్సిగూడ, రామంతాపూర్ , చిలుకానగర్ తదితర ప్రాం తాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ .. 9 గంటలకు 5శాతం పోలింగ్, 11 గంటల వరకు 15 .1శాతం , మధ్యాహ్నం 1 గంటవరకు ఉప్పల్లో 26 .1 శాతం, మధ్యాహ్నం 3 గంటలవరకు 34. 2 శాతం పోలింగ్ న మోదైంది. అన్ని బూత్లలో మధ్యాహ్నం తర్వాత కొంత మేరకు ఓటింగ్ శాతం పెరిగింది. హబ్సిగూడ జ్ఞాన భారతి స్కూల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి , మాజీ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా శ్రీసాయి పబ్లిక్స్కూల్లో రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వే శారు. నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రామంతాపూర్లోని రాజేంద్రనగర్, వెంకట్రెడ్డినగర్, శ్రీనివాసపురం , నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ బూత్లలోకి వెళ్లి ఓటింగ్ను చూశారు. ఎంబీసీ మాజీ అధ్యక్షుడు తాడూరి శ్రీనివాస్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరావు పలు బూత్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను, బూత్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.