హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ తీసుకున్న ఆ 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిలో కొంతమంది వీఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
పబ్ మేనేజర్ అనిల్తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్లో గోవా, ముంబైకి చెందిన కొంతమంది పేర్లు ఉన్నట్లు సమాచారం. మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లిస్ట్లో గతంలో డ్రగ్స్తో పట్టుబడిన సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.