మారేడ్పల్లి, అక్టోబర్ 30: రైళ్లలో గంజాయి నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, వరంగల్, నాంపల్లి, కాచిగూడ తదితర రైల్వే స్టేషన్లలో గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించామని చెప్పారు. 2022 సంవత్సరంలో నేటి వరకు 31 కేసుల్లో 30 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2.79 కోట్ల విలువజేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.