హైదరాబాద్: మాదకద్రవ్యాల రవాణా (Drugs)కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐదురోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో చంచల్గూడ జైలు నుంచి పోలీసులు పంజాగుట్ట పీఎస్కు తరలించారు.
వచ్చే నెల 2వ తేదీవరకు పోలీసులు విచారించనున్నారు. దీంతో డ్రగ్స్ రవాణాకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. హైదరాబాద్లో ప్రముఖులతో సంబంధాలపై ఆరాతీయనున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విసయం తెలిసిందే.