హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని పోలీసులు నేటి నుంచి విచారించనున్నారు. పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న టోనీని తమ ఆధీనంలోకి తీసుకుని ఐదు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్లో ప్రముఖులో సంబంధాలపై ఆరాతీయనున్నారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. టోనీని మరింత లోతుగా విచారించి ఇంకా ఎవరున్నారనే దానిపై విచారించనున్నారు.
టోనీ 34 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. వారి టర్నోవర్ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని అంచనావేస్తున్నారు. టోనీ అనుచరులైన ఇమ్రాన్, నూర్ఖాన్ను మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.