హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోను పోలీసులు కేసులను ఛేదిస్తున్నారు. నేరానికి పాల్పడినవారిని పక్కా ఆధారాలతో జైలుశిక్ష పడేలా చూస్తున్నారు. నగర శివార్లలోని మీర్పేట పరిధిలో నిన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. మీర్పేట పరిధిలోని శివనారాయణపురంలో రిటైర్డ్ ఉద్యోగి రత్నాకర్ నివాసం ఉంటున్నారు.
బుధవారం రాత్రి ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి.. 31 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీ చేశాడు. గుర్తించిన రత్నాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి గంటల వ్యవధిలోనే నిందితున్ని అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదుచేశారు.