హైదరాబాద్ : దుండిగల్ పీఎస్ పరిధిలో(Dundigal Police station area) సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భారీగా గంజాయిని( Ganja) పట్టుకున్నారు. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని 1.35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్కు గంజాయిని తీసుకొచ్చి విద్యా సంస్థలే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దుండిగల్ పీఎస్ పరిధిలోని ఓపెన్ ల్యాండ్, బౌరంపేట వద్ద దాడులు నిర్వహించారు. రంజన్ దాస్,కేశవ్ కౌర్, కె.గంగా అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.