హైదరాబాద్ : గంజాయి(Ganja) రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాడ్జిలో(Lodge) గంజాయిని నిల్వ చేశారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్(Secunderabad) గోపాలపురంలోని ఓ లాడ్జిలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు పోలీసులను నెట్టేసి పారిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.