19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
మారేడ్పల్లి, మార్చి 16: రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం…ఒరిస్సా రాష్ర్టానికి చెందిన ప్రకాశ్ ప్రదన్ ( 26) విశాఖపట్నం నుంచి ముంబైకి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైల్లో 19 కిలోల గంజాయిని సరఫరా చేస్తున్నాడు. మంగళవారం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్ ఫారం పైకి వచ్చింది. జీఆర్పీ పోలీసులు ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు బోగీలను తనిఖీలు చేస్తుండగా ప్రకాశ్ ప్రదన్ బ్యాగ్లను తనిఖీలు చేయగా అందులో గంజాయి గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.