హైదరాబాద్ : డ్రగ్స్(Drugs) సరఫరాపై పోలీసులు(Police) ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ తీసుకొని వచ్చి పట్టుబడితే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. అరెస్ట్తో పాటు జైలు జాలు కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. బంగారు భవిష్యత్తను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్ రహిత రాష్ట్రానికి అందరూ సహకరించాలని పోలీసులు కోరారు.