Hyderabad | వెంగళరావునగర్, జూన్ 1 : అమీర్పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీ ని ఆరెస్ట్ చేశారు. ఇందుకు సంబందించి ఎస్. ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన.. యాప్రాల్ జ్యోతి, ఉషాశ్రీలు అమీర్పేటలోని శాంతి నిలయం అపార్ట్మెంట్లో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో గత కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆరుగురు యువతులు, చాంద్రాయణగుట్టకు చెందిన విద్యార్థి షేక్ రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా ప్రధాన నిందితురాలు జ్యోతి పరారీలో ఉంది.