హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పోలీసు స్టేషన్లో మొత్తం 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లతో పాటు ముగ్గురు హోంగార్డులకు కరోనా వచ్చింది. దీంతో వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల పోలీసు స్టేషన్కు వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328, మేడ్చల్ మల్కాజిగిరిలో 248, రంగారెడ్డిలో 202, సంగారెడ్డిలో 78, హనుమకొండలో 75, నిజామాబాద్లో 60, మంచిర్యాలలో 58, ఖమ్మంలో 56 కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 3.2 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 96.51 శాతానికి తగ్గింది.