సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న బక్రీద్ సందర్భంగా బుధవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పశు సంరక్షణకు, గో రక్షక్ కార్యకర్తలు, హిందూ సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.
పశువుల క్రయ, విక్రయాలు, రవాణాకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్, డీసీపీలు జోయెల్ డేవీస్, సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.