దుండిగల్,ఫిబ్రవరి 6 : గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్రావు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా,నెల్లుట్ల గ్రామానికి చెందిన శివరాత్రి కొమురయ్య కొడుకు నరేందర్(29) ఇంటర్ వరకు చది వాడు. అనంతరం ఉపాధికోసం నగరానికి వలసవచ్చి, చింతల్ మాణిక్యనగర్లో నివాసమున్నాడు. 2017 నుంచి 2019 వరకు స్టాక్మార్కెట్ లావాదేవీలు నిర్వహించగా.. అందులో నష్టాలు చవిచూడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తనకు స్టాక్మార్కెట్లో పరిచయమైన వైజాగ్కు చెందిన రాజేశ్ అనే వ్యక్తితో చర్చించి గంజాయిని స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7 గంటలకు వైజాగ్ నుంచి బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలోని ఎస్వీ రెసిడెన్సీకి కియా కారు(టీఎస్ 13ఈయు0707)లో గంజాయిని తరలిస్త్తున్నట్లు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డీఎస్ఐ సాయినాథ్ క్రైంపార్టీ పోలీసులతో కలిసి కేఆర్సీఆర్ కాలనీ జంక్షన్ కమాన్ వద్ద కాపు కాశారు. రాత్రి 9.30 గంటల సమయంలో అటుగా వచ్చిన కియా కారును ఆపి తనిఖీ చేయగా 41 కిలోల రెండు ఎండు గంజాయి బ్యాగ్ లు లభించాయి.
నరేందర్ను అదుపులోకి తీసుకుని ప్ర శ్నించగా వైజాగ్కు చెందిన రాజేశ్ గంజాయి పంపినట్లు అంగీకరించాడు. రాజేశ్ చెప్పినట్లుగా రూ.2.15 లక్షలు పంపించానని, సుభాష్నగర్లో కారును అద్దెకు తీసుకుని మూసాపేట్లోని గూడ్స్షెడ్ వద్దకు వెళ్లగా ఇద్దరు వ్యక్తులు రెండు సంచుల్లో 41 కిలోల గంజాయిని అందజేశారని పేర్కొన్నాడు. దీంతో నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 41 కిలోల ఎండు గంజాయి, కారు, ఫోన్ను సీజ్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు. కాగా రాజేశ్ పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలింపు చేపట్టామని డీసీపీ పేర్కొన్నారు. కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు పర్యవేక్షణలో గంజాయితో పాటు నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, కానిస్టేబుళ్లు రాజు, రాజేశ్, కనకయ్యలను డీసీపీ అభినందించారు.