హయత్నగర్, ఫిబ్రవరి 13 : గంజాయి విక్రయిస్తున్న ఓ లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 2 కిలోల గంజాయి, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, డీఐ ఆర్.నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం…అబ్దుల్లాపూర్మెట్ మండ లం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు, రావినారాయణరెడ్డి కాలనీలో నివాసముంటున్న కాటి చంద్రమోహన్(35), వృత్తిరీత్యా లారీ డ్రైవర్. గత 14 సంవత్సరాలుగా లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో భద్రాచలంలో ఇసుక లారీ లోడ్ నింపుకొని హైదరాబాద్కు వస్తున్నాడు. అక్కడే ఉంటున్న గుర్తు తెలియని వ్యక్తి వద్ద రూ.5వేలు నగదు చెల్లించి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు విక్రయించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు.
లారీ లోడింగ్ అనంతరం గంజాయిని తీసుకొని రావినారాయణరెడ్డి కాలనీ, పాపాయిగూడ చౌరస్తాలో కవర్లో పట్టుకొని విక్రయించేందుకు వస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని చేతిలో ఉన్న కవర్ను పరిశీలించగా గంజాయి అని నిర్ధారించారు. నిందితుడితోపాటు గంజాయిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.