శంకర్పల్లి : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న మాణిక్యం(28)తో మూడు నెలల కిందట, అలాగే, పట్టణానికే చెందిన ప్రైవేట్ వ్యాపారి సునీల్ (22)తోనూ పరిచయం ఏర్పడింది. కాగా, వారు ఇద్దరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలికను శంషాబాద్లోని భరోసా కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.