అబిడ్స్, ఆగస్టు 16 : గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని గన్ఫౌండ్రి ప్రాంతంలో శ్రావణ మాసం బోనాలను ఘనంగా ముగిశాయి. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు గన్ఫౌండ్రి ప్రాంతానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గన్ఫౌండ్రిలోని సప్తాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ప్రాంతంలోని సప్తాలయాలలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
బోనాల ఉత్సవాలలో అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తొట్టెల ఊరేగింపులను నిర్వహించారు.