JNTUH | హైదరాబాద్లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగారు. కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి హాస్టల్లో ఫుడ్ క్వాంటిటీ సరిపోవడం లేదని.. క్వాలిటీ కూడా బాగోవడం లేదంటూ యూనివర్సిటీ గేటు ముందు ధర్నా చేపట్టారు. దీనిపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. కంప్లయింట్ చేసిన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
The students protested that JNTU principal was ignoring the complaints regarding insects, rubber bands and glass shells were coming in the meals in the PG university mess. Who is responsible for this? pic.twitter.com/PIoSAfMIcJ
— Jntuh Updates (@examupdt) January 4, 2024
ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి హాస్టల్లో ఫుడ్ క్వాంటిటీ సరిపోవట్లేదు.. క్వాలిటీ కూడా బాగోలేదు. ఆహారంలో రబ్బర్, ఈగలు, పురుగులు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల వరకే హాస్టల్ డోర్ క్లోజ్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నారని.. ఎక్కడైనా కూర్చుంటే ఎందుకు కూర్చొన్నారని నిలదీస్తున్నారని అన్నారు. హాస్టల్లో ఫుడ్ బాగోలేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో మెస్ కూడా సరిగ్గా లేదని.. రాత్రిపూట చీకట్లో కూర్చొని తినాల్సి వస్తున్నదని అన్నారు. దీనిపై అడిగితే ఏం చేయాలి.. మీకోసం ఇంద్రభవనం తీసుకురాలేమని ఎగతాళిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వాళ్లను టార్గెట్ చేస్తున్నారని.. ఎక్కువగా మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయమంటున్నారని వాపోయారు. తమకు ఈ ప్రిన్సిపాల్ అక్కర్లేదని స్పష్టం చేశారు.