ఓదెల, ఏప్రిల్ 9: పుష్కలమైన నీటి వనరులతో బంగారు వర్ణంలో పండిన పంటలు.. మొదలైన యాసంగి కోతలు.. కల్లాలకు వస్తున్న ధాన్యపురాశులు.. వడ్లను తూర్పార పడుతూ.. ఆరబోస్తూ.. కుప్పలు చేస్తూ బిజీబిజీగా రైతులు.. ఇప్పుడు ఏ పల్లెకు వెళ్లినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యాసంగిలో వరి సాగంటేనే ‘పండుతుందా..? ఎండుతుందా..?’ అనే ఆందోళనలో ఉన్న రైతులు.. ఇప్పుడు కాళేశ్వరం జలాలతో దండిగా పండిన పంటలను చూసి సంబురపడుతున్నారు. పొలాల వద్దే కొనుగోళ్లు చేపడుతుండడంతో సంతోషపడుతున్నారు. తన మూడెకరాల్లో ఏసిన పంట గుంట కూడా ఎండకుండా మొత్తం చేతికచ్చిందంటూ ఆనందపడుతున్నాడు కనగర్తికి చెందిన రాయిల్ల ఓదెలు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఇలా ఆరబోస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి..