హైదరాబాద్: కోకాపేటలో (Kokapet) దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం కోకాపేట సర్వీస్ రోడ్డులో ఆటో కోసం వేచిఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడి జేబులో ఉన్న రూ.4,500 నగదును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీటీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. కోకాపేట సర్వీసు రోడ్డులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది ఐదోసారి. ఒంటరిగా ఉన్న వ్యక్తులే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.