అంబర్పేట, ఆగస్టు 20 : టీకాలు తీసుకునేందుకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ అంబేద్కర్నగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబర్పేట సర్కిల్ పరిధిలో రెండు మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు పని చేస్తున్నాయన్నారు.
ప్రతి రోజు ఏదో ఒక చోట ఈ బృందం తాత్కాలిక సెంటర్ను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నదని పేర్కొన్నారు. ప్రధానంగా మురికివాడలను కవర్ చేస్తూ ఒక్కో రోజు ఒక్కోచోట టీకాలు వేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు టీకాను తీసుకోని వారు వెంటనే మొబైల్ బృందం వద్దకు వెళ్లి టీకా వేయించుకోవాలని సూచించారు.
మొదటి, రెండో డోసులు ఇక్కడ లభ్యమవుతున్నాయన్నారు. అలాగే అంబర్పేట మున్సిపల్ మైదానంలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ఉందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్, వైద్య సిబ్బంది అరుణకుమారి, శోభ, కావ్య తదితరులు పాల్గొన్నారు.