సుల్తాన్బజార్, ఆగస్టు 18 : న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఏడాదిలోపు వయసు కలిగిన పిల్లలకు ఇవ్వడం వల్ల న్యూమోనియా బారిన పడకుండా కాపాడుకోవచ్చని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ అన్నారు. కోఠి ఆర్ఎఫ్ పీటీసీ యూపీహెచ్సీ సుల్తాన్బజార్, యూపీహెచ్సీలలో ఏడాది లోపు చిన్నారులకు పీసీవీ టీకాల పంపిణీ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మజ మాట్లాడుతూ.. ప్రయివేట్ దవఖానలలో ఒక టీకాకు నాలుగు వేల రూపాయల ఖర్చు అవుతుందన్నారు.
ప్రభుత్వం ఈ టీకాను ఏడాది లోపు చిన్నారులకు మూడు విడుతలుగా ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ పీటీసీ, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, డాక్టర్ రమేష్, పీహెచ్ఎన్ రామలక్ష్మితో పాటు నర్సులు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.