సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ ) : ప్రతిష్టాత్మక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జూన్ 3 నుంచి 15 రోజుల వరకు వార్డుల పరిధిలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లను తమ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం వలన అభివృద్ధి పనులకు ప్రణాళిక, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి నగరంలో ఎదురొంటున్న సమస్యలను అధిగమించడానికి దోహదపడుతుందని మేయర్ అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి అవగాహనతో పాటు ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పనికి రాని వస్తువులు, నిర్మాణ వ్యర్థాల కోసం తాతాలిక పాయింట్ గుర్తించి సేకరించిన మొత్తాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో నాటిన మొకల చుట్టూ కలుపు తీయడం, మట్టి పోయడం, ఎండిపోయిన మొక స్థానంలో మరొక మొక్క నాటాలని, నీరు నిలువకుండా పరిశుభ్రత పాటించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్, శానిటేషన్ యుబిడి, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.