హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూసీ నది బఫర్ జోన్ 50 మీటర్లు అన్నప్పుడు, 500 మీటర్ల దూరం ఉన్న వాళ్లకి నోటీసులు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా? అని నిలదీశారు. నిలువనీడ లేకుండా పేదల ఇండ్లు కూల్చేసి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపడుతామంటే కుదరన్నారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నువ్వు శివతాండవం చేసినా, డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం
మూసీ నది బఫర్ జోన్ 50 మీటర్లు అన్నప్పుడు, 500 మీటర్ల దూరం ఉన్న వాళ్లకి నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా? – బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి https://t.co/NYaQpWEtcV pic.twitter.com/RLhglAIHgM
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026