Patlolla Karthik Reddy | జియాగూడ మేకల మండిని జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించడాన్ని నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు పని లేకపోతే రోజే గడవదు మనకు. చాలా మంది ఇక్కడ రోజు కూలీలున్నరు. పనే నడవకపోతే ఇల్లే నడవలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నరు. ఇవేవి ఆలోచన చేయకుండా మన జియాగూడ మార్కెట్ (మేకల మండి)ని బంద్ చేసిర్రో.. అందుకు నిరసనగా తరలివచ్చిన
అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చింది.. ఈ మూసీని ఏదన్నా ఒకటి చేయాలే. దీని వల్ల మనకు మంచిగైతదని కాదు.. ఆయనకు పేరొస్తది.. మూసీని మంచిగ చేస్తే ఏదో రాజకీయంగా లబ్ధి కావాలే.. దీని వల్ల వేలాది జీవితాలు నాశనమైపోయినా ఫర్వాలేదనే ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది కాబట్టి ఎప్పుడూ మన జియాగూడ మార్కెట్లో కనిపించని, కలువని కలుషితం ఇప్పుడు అధికారులకు కనిపిస్తుందట. నెలకు రూ.200 కోట్ల వ్యాపారం నడుస్తున్న మార్కెట్ను బంద్ చేస్తడా..? బుద్ధున్న గాడిది గాడు ఎవడైనా . ఇలాంటి పనులు చేస్తరు కాబట్టే ప్రభుత్వం దగ్గర పైసలు వస్తలేవు. వేలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారపడిన మార్కెట్ను బంద్ చేస్తరా..? మీకేమన్నా బుద్దీ జ్ఞానం ఉన్నదా.. మీరు రాష్ట్రం నడుపుతున్నరా..? కామెడీ షో నడుపుతున్నరా..? అని ప్రశ్నించారు.
ఆదివారం లోపు జియాగూడా స్లాటర్ హౌజ్ మార్కెట్ తెరవకపోతే ఉద్యమం తారా స్థాయికి తీసుకెళ్తాము అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసే ఈ పిచ్చి పనులు ఏంటి..? 1930 నిజాం కాలం నుండి ఇక్కడ స్లాటర్ హౌస్ నడుస్తున్నది. నీకు చిత్తశుద్ధి ఉంటే వేరే చోట మార్కెట్ కట్టించి ఇక్కడ ఖాళీ చేయించు.. అని హెచ్చరించారు. ఈ ఆదివారం లోపు మార్కెట్ ఓపెన్ చేయకపోతే సోమవారం GHMC ఆఫీస్ ముందు యాటలు కటింగ్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
200 కోట్ల వ్యాపారం చేసే మార్కెట్ ఎవడన్నా బంజేస్తారా? బుర్రల పెండ ఉన్నదా?
నువ్వు ప్రభుత్వం నడుపుతున్నావా, కామెడీ షో నడుపుతున్నావా రేవంత్ రెడ్డి
ఆదివారం లోపు జియాగూడా స్లాటర్ హౌజ్ మార్కెట్ తెరవకపోతే ఉద్యమం తారా స్థాయికి తీసుకెళ్తాము అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం… pic.twitter.com/NipcNxbggW
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు