దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
సుల్తాన్ బజార్, మార్చి 26: ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోతే చేర్పించిన సమయంలో ఇచ్చిన వివరాలనే ఉస్మానియా నుంచి ఆన్లైన్లో నమోదు చేసే పేర్లను యధాతథంగా జీహెచ్ఎంసీ జనన, మరణ విభాగం అధికారులకు జాబితాను పంపిస్తున్నట్లు వివరించారు. దవాఖాన రికార్డుల్లో ఉన్న విధంగా పత్రాలు జారీ అవుతున్నాయని అన్నారు. దీంతో పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.