హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి విస్తరించడంతో.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు సరూర్నగర్లో అత్యధికంగా 47.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. హయత్నగర్, ఉప్పల్, సైదాబాద్, కాప్రా, గోల్కొండ ప్రాంతాల్లో 26 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
ఇక ఆగస్టు 31వ తేదీ వరకు హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, సంగారెడ్డి, నల్లగొండ, జనగామ, పెద్దపల్లి జిల్లాలో 58.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలోని నారాయణరావుపేటలో అత్యధికంగా 64 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.