సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుపై కొన్ని చోట్ల టోల్ప్లాజాల్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో ఓఆర్ఆర్ పైకి ఎక్కే సమయంలో, కిందకు దిగే సమయంలో వాహనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సెన్సర్లు సరిగా పనిచేయడం లేదు. ఓఆర్ఆర్పై 21 చోట్ల ఇంటర్చేంజ్లు ఉండగా, ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, కిందకు దిగేందుకు వేర్వేరుగా టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి చార్జీలను ఫాస్టాగ్ ద్వారా వసూలు చేస్తున్నారు.
ప్రధానంగా తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ ఇంటర్చేంజ్ వరకు ఉన్న ఔటర్పై టోల్ ప్లాజాల వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే సెన్సర్లు సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ఫాస్టాగ్ ద్వారా ఆటోమెటిక్గా టోల్ చార్జీలు కట్ అవుతుండటంతో దీన్ని తాముగా సరిగా గుర్తించలేకపోతున్నామని, సందేశాలు ఫోన్లకు సరిగా రావడం లేదని పేర్కొంటున్నారు.