యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా చేరికలు కొనసాగాయి.
చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 50 కుటుంబాలు గులాబీ పార్టీలో చేరాయి. నాంపల్లి మండలం ముష్టిపల్లిలో అభివృద్ధికి ఆకర్షితులై ఎంపీ మాలోతు కవిత సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు.