బంజారాహిల్స్, జూన్ 16 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు వందమందికి పైగా గురువారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన నాయకులు సికిందర్, సొహైల్, హమీద్, సద్దామ్, మౌలా, షకీల్, అలీమ్, ఇర్ఫాన్ తదితరులతో పాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఖురేషీ, తదితరులు పాల్గొన్నారు.