ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 15: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఎన్ గోపీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి.
ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ సూర్యాధనంజయ, ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.