విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
కందుకూరు, మే 24: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి యువకులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 100మందికిపైగా సర్పంచ్ ఇంజమూరి రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కాకి దశరథ ముదిరాజ్, పార్టీ మాజీ అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ, సమన్వయ సమితి అధ్యక్షుడు క్రిష్ణరాంభూపాల్రెడ్డి, డైరెక్టరు పొట్టి ఆనంద్, తాండ్ర దేవేందర్ పాల్గొన్నారు.