కవాడిగూడ, మార్చి 3: రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోలక్పూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు ముఠా జయసింహతో కలిసి ప్రారంభించారు. ముందుగా డివిజన్లోని బాకారం మల్లన్న దేవాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని ప్రారంభించి బడీ మసీద్, ఎస్కే పాయింట్ వీధి, గుల్షన్నగర్, అంజుమన్ వీధి మీదుగా ఇందిరానగర్లో ప్రారంభించే బీఆర్ఎస్ కార్యాలయం వరకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా నిలవాలని, భోలక్పూర్ డివిజన్లో ఆధునిక రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రహీం, ఎండీ షరీఫ్, మహ్మద్ అలీ, శంకర్ గౌడ్, ఉమాకాంత్ ముదిరాజ్, మున్వర్ చాంద్, జునేద్ బాగ్దాది, జబ్బార్, దీన్ దయాల్ రెడ్డి, శివ ముదిరాజ్, మాధవ్, మహేశ్కుమార్, భీమేశ్ కుమార్, కేంఎం. సాయి, కళ్యాణ్, హరీష్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ముషీరాబాద్ మహంకాళీ దేవాలయం మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు (దోమ రాజు) అస్వస్థతతో ఎస్సార్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు జయసింహలతో కలిసి శుక్రవారం ఆయనను పరామర్శించారు. రాజు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివ ముదిరాజ్, రాకేష్ కుమార్, మారిశెట్టి నర్సింగ్ రావు, సదా ముదిరాజ్, పరుషరామ్, శ్రీకాంత్ యాదవ్, క్రాంతి రెడ్డి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.