సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాంద్రాయణగుట్ట 6.56శాతం, నాంపల్లి 6.17శాతం మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ఊపందుకోలేదు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లకపోవడం, ఫారాలను ఓటర్ల నుంచి తీసుకోవడంలో జాప్యం చేస్తుండడం, చేతిలో ఉన్న ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం.

Hyd2