మణికొండ, ఫిబ్రవరి 16 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందస్తు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత చదువుల వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస రావు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కేవీఎంఆర్ ప్రైడ్ గార్డెన్స్లో శుక్రవారం సాయంత్రం నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల క్యాంపులకు చెందిన 500మంది విద్యార్థులతో కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య కళాశాలల ఏజీఎం డి.వెంకటేశ్వర్లు, నమస్తే ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ డా.జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్ పూర్తైన తర్వాత ఉన్నత ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఉన్నత చదువులు ఎక్కడ చదవాలి అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులు సుస్థిరమైన లక్ష్యాలను తీసుకుని ఎక్కడ చదివితే తమ లక్ష్యాలు నెరవేర్చడం సాధ్యమవుతుందనే అంశాలను వెల్లడించారు. ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలను పొందాలనుకునే విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీని ధీమాగా ఎంచుకోవచ్చన్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ నాలుగేండ్లు కష్టపడి చదివితే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని 40 ఏండ్లు సుఖంగా జీవించే అవకాశాలు ఉంటాయన్నారు.
కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిఫ్లను అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ(బీ.టెక్) చదివే విద్యార్థులకు ఒకేసారి రెండు కోర్సులను (డ్యూయల్ డిగ్రీ) చదివేలా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రధానంగా బీటెక్ ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎల్ఈ బ్రాంచ్ ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు కూడా బీటెక్ రెండవ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రస్తుతం పెద్దపెద్ద ఇండస్ట్రీలలో మల్టీ డిసిప్లీనరి (బహుళ క్రమశిక్షణ) డిగ్రీ చదివిన వారికే అవకాశాలు అధికంగా వస్తున్నాయని చెప్పారు కేఎల్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అత్యధికంగా 60లక్షల వేతనం తీసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా తమ యూనివర్సిటీలో రెండేండ్లు చదువుకున్న విద్యార్థి మిగతా రెండేండ్లు, మూడేండ్లు చదువుతున్న విద్యార్థి చివరి ఏడాది విదేశాల్లో తమకు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాన్ని కేఎల్ యూనివర్సిటీ మాత్రమే కల్పిస్తుందన్నారు. తమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఐదు ఫారెన్ లాంగ్వేజీలను ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు. జేఈఈలో 95శాతం పర్సంటైజ్ సాధించిన వారికి కేఎల్ యూనివర్సిటీలో ఉచితంగా సీటును కేటాయిస్తుందన్నారు. కేఎల్ యూనివర్సిటీలో జేఈఈ బేసిక్ ఎగ్జామ్ ఆన్లైన్-ఆప్లైన్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి శ్రీచైతన్య కళాశాల ఏజీఎం డి.వెంకటేశ్వర్లు, నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ విభాగం ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన అవగాహన సదస్సు ద్వారా ఇంటర్ తర్వాత ఏం చదవాలో తెలుసుకున్నాం. భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై మంచి అవగాహన అందించారు. అత్యధిక ప్యాకేజీ పొందే కంపెనీలో స్థానాన్ని దక్కించుకునేందుకు ఇలాంటి సదస్సులు మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
కేఎల్ యూనివర్సిటీ, ప్రముఖ దినపత్రికలు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడేలతో కలిసి విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న అవగాహన సదస్సు మాలాంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు తీసుకుని చదవాలి. చదివిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశాలను స్పష్టంగా తెలుపడం మాకు సంతోషంగా ఉంది. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇదో చక్కటి అవకాశం.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. యూనివర్సిటీ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వారి ప్రమోషన్లో భాగమే అనుకున్నాను. కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల కోసం “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రిక”లు కేఎల్ యూనివర్సిటీతో కలిసి కొంతకాలంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు సరియైన మార్గం దొరుకుతుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏఏ కోర్సులలో చేరితే ఎలాంటి ప్రయోజనాలు కల్గుతాయనే అంశాలను కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం స్వచ్ఛందంగా సదస్సులను నిర్వహిస్తుండటం ఎంతో ఆదర్శనీయమైన నిర్ణయం. కమర్షియల్ సొసైటీ కాంపిటీషన్లో విద్యార్థులు కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కమర్షియల్గా ముందుకు సాగాలి. కేఎల్ యూనివర్సిటీ వారి పనితీరును చూస్తే ఖచ్చితంగా విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చేందుకు శక్తివంచనలేకుండా పాటుపడుతుందని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి యూనివర్సిటీలలో విద్యార్థులు చేరితే వారి ఉజ్వల భవిష్యత్తు ఉన్నత శిఖరాలవైపు వెళ్తుందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.