Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వేను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్డు నంబర్ 2 నుంచి వన్వేగా మళ్లించారు. అంటే టీవీ9 ఆఫీసు నుంచి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమ వైపునకు మళ్లించారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వెళ్లే విధంగా ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా ఇవాళ రెండు గంటల పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వేను అమలు చేశారు. ఇందులో తలెత్తిన సమస్యలు, లోటుపాట్లను విశ్లేషించిన తర్వాత.. ఈ రూట్లో వన్వే అమలు చేయాలా? వద్దా? అనే దానిపై ట్రాఫిక్ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపధ్యంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసుల చర్యలు
టీవీ9 ఆఫీసు నుండి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమవైపుకు మళ్లిస్తూ, తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్… pic.twitter.com/1QWr5FDgkA
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026