హైదరాబాద్ : జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.