హైదరాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్ విహార్ కాలనీలో.. గ్యాస్ సిలిండర్ పేలడంతో అంబలాల్ నాయక్ అనే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కన్హలాల్, మాధవ్లను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
ఈ విషాదకర సంఘటన రైల్ విహార్లో గల బాదం మిల్క్ షేక్కు సంబంధించిన గోడౌన్లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతోనే పేలుడు సంభవించి ఉండవచ్చని చందానగర్ ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.