Hyderabad | హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ మీద ఆగివున్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒక మహిళ, చిన్నారి ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.