Blast | నగరంలో పేలుడు కలకలం సృష్టించించింది. ముషీరాబాద్ పరిధి భోలక్పూర్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో శనివారం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోడౌన్లో పని చేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోడౌన్లోని కెమికల్ బాక్స్ను కట్ చేస్తున్న సమయంలో పేలుడు జరిగిందని, ఆ తర్వాత మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. స్క్రాప్ గోడౌన్ పక్కనే స్కూల్ ఉందని, పేలుడుతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన కార్మికుడిని గౌసుద్దీన్గా గుర్తించారు. అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.