హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): భూముల వేలం ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ అప్పులు చేస్తున్నది. రాబడి లేదు.. ఖర్చులకు పైసల్లేవని ఏకంగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సెలవిచ్చారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషనే లిమిటెడ్(టీజీఐఐసీ) రాయదర్గంలో నిర్వ హించిన భూముల వేలంలో ఎకరం రూ.204కోట్లు ధర పలికింది. సోమవారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 83/1 సర్వే నంబర్లోని 5.09 ఎకరాల భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహించగా, ఎకరం రూ.204కోట్లకు ధర పలుకగా.. 5.09 ఎకరాలకు రూ.1020 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు.
రెండురోజుల క్రితం ఇక్కడ నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. 6.29 ఎకరాల భూమి వేలంగా వేయగా, ప్రభుత్వానికి రూ.1,490 కోట్లు ఆదాయం సమకూరింది. రెండు విడతల్లో కలిపి వేలంలో సుమారు రూ.2,500 కోట్లు ఆదాయం సమకూరింది.